తెలంగాణలో కరోనా అప్‌డేట్.. ఐదుగురు మృతి.. కొత్తగా 1,421 కేసులు

శనివారం, 24 అక్టోబరు 2020 (10:31 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. శుక్రవారం కొత్తగా 1,421 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,30,274కి చేరింది. తాజాగా కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,303కి చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
తాజాగా 1,708 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,09,034 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,937 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. 16,809 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 227 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

అన్నీ చూడండి

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments