Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ-ఆరుగురు మృతి

Written By సెల్వి
Updated: శనివారం, 22 జనవరి 2022 (17:30 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనా తీవ్రత కారణంగా రోజుకు 12వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్ పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,538కి పెరిగింది. అదే సమయంలో 3,913 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,66,194 పాజిటివ్ కేసులు నమోదైనాయి
 
విశాఖ జిల్లాలో 1,959 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు, అనంతపురం జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,212 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,001 కేసులు వెల్లడయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ భారీగా కొత్త కేసులు గుర్తించారు.

అన్నీ చూడండి

పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు : సమంతకు ఆన్సర్ ఏంటి?

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

తర్వాతి కథనం
Show comments