ఏపీలో కొత్తగా 2526 మందికి కరోనా పాజిటివ్

గురువారం, 15 జులై 2021 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 2526 మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో ఈ కేసులు బయటపడ్డాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. 
 
ఈ కేసులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 404 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 391, ప్రకాశం జిల్లాలో 308 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 35 కేసులు గుర్తించారు.
 
మరోవైపు, 2,933 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,32,105 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,93,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,526 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,081కి పెరిగింది.

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments