Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏపీలో 50, తెలంగాణలో 157 కేసులు

Written By సెల్వి
Updated: బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:18 IST)
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 121 మంది చికిత్సకు కోలుకొని దవాఖాల నుంచి డిశ్చార్జి అయ్యారు. నెల్లూరు జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,605 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. వైరస్‌ ప్రభావంతో నేటివరకు 7,161 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.
 
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 29,666 మందికి కరోనా పరీక్షలు చేయగా 157 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరో 163 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,988కి చేరింది. ఇప్పటివరకు కోవిడ్-19తో 1,613 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 2,92,578 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 1,797 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 729 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 27 కరోనా కేసులు బయటపడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments