ఏపీలో కరోనా.. 51 కేసులు.. ఇద్దరు మృతి

Written By సెల్వి
Updated: బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (19:13 IST)
ఏపీలో కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 26,474 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 51 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,010కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,165 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 57 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,238కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 607 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,36,15,847 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments