జూన్ 25 కరోనా బులిటెన్ : 51 వేల పాజిటివ్ కేసులు

శుక్రవారం, 25 జూన్ 2021 (10:16 IST)
దేశంలో జూన్ 25వ తేదీ శుక్రవారం కరోనా బులిటెన్ వెల్లడైంది. ఈ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో మొత్తం 51,667 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
అలాగే, 64,527 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇకపోతే దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, గురువారం 1,329 మంది కరోనా బాధితులు చనిపోయారు. 
 
దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,93,310కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,28,267 మంది కోలుకున్నారు. 6,12,868 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేశారు.  
   
కాగా, దేశంలో శుక్రవారం వరకు మొత్తం 39,95,68,448 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. 24న 17,35,781 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

అన్నీ చూడండి

క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు

Shraddha Das: మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధాదాస్‘త్రికాల సిద్దమైంది

కోలీవుడ్‌లో విషాదం.. నదిలో దూకి నిర్మాత ఆత్మహత్య... ఎఁదుకో తెలుసా?

Chiru158: తన 158వ సినిమా బాబీ కొల్లి కాంబినేషన్ లో ప్రారంభిస్తున్నానని ప్రకటించిన చిరంజీవి

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

తర్వాతి కథనం
Show comments