ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:29 IST)
ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. చీరాల మండలం పేరాలలో ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ కుటుంబంలో 50 యేళ్ళ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.  
 
మన దేశంలోకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. అప్పటి నుంచి అనేక రాష్ట్రాలకు ఈ వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1272 వరకు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. 
 
దీంతో ఒమిక్రాన్ బాధితురాలి కుటుంబ సభ్యులకు చెందిన శాంపిల్స్‌ను ఆరోగ్య శాఖ అధికారులు సేకరించి, హైదారాబాద్ నగరంలోని సీసీఎంబీ పరిశోధనా కేంద్రానికి పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఆ మహిళకు ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసుతో కలుకుని ఈ జిల్లాలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. 

అన్నీ చూడండి

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

తర్వాతి కథనం
Show comments