ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:29 IST)
ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. చీరాల మండలం పేరాలలో ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ కుటుంబంలో 50 యేళ్ళ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.  
 
మన దేశంలోకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. అప్పటి నుంచి అనేక రాష్ట్రాలకు ఈ వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1272 వరకు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. 
 
దీంతో ఒమిక్రాన్ బాధితురాలి కుటుంబ సభ్యులకు చెందిన శాంపిల్స్‌ను ఆరోగ్య శాఖ అధికారులు సేకరించి, హైదారాబాద్ నగరంలోని సీసీఎంబీ పరిశోధనా కేంద్రానికి పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఆ మహిళకు ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసుతో కలుకుని ఈ జిల్లాలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. 

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments