వామ్మో వైరస్‌లు.. దేశంలో తొలి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు

బుధవారం, 2 జూన్ 2021 (09:53 IST)
ఓ వైపు దేశంలో కరోనా పంజా విసురుతోంది. మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌తో పాటు వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు సైతం రికార్డవుతున్నాయి. తాజాగా స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ వెలుగు చూసింది. దేశంలోనే మొదటి కేసు కర్ణాటకలోని చిత్రదుర్గలో నమోదవగా.. ఒక్కసారిగా కలకలం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన 54 ఏళ్ల రోగికి స్కిన్ మ్యూకోయిడ్ మైకోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. 
 
దేశంలో తొలి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు ఇదేనని పేర్కొన్నారు. బాధితుడు నెల రోజుల కిందట కరోనా బారినపడి కోలుకున్నాడు. బాధితుడికి మధుమేహం సైతం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించగా.. ఇప్పుడు రెండో దశ శస్త్ర చికిత్సకు సిద్ధమవుతున్నట్లు వైద్యులు వివరించారు.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments