దేశంలో ఉధృతంగా కరోనా పాజిటివ్ కేసులు - కొత్తగా 2.64 లక్షల కేసులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 14 జనవరి 2022 (11:20 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కోవిడ్ కేసుల పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,64,202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఎనిమిది నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 5,753కి పెరిగిపోయింది. నిన్నటితో పోల్చితే ఈ కేసుల పెరుగుదలలో 4.83 శాతం పెరుగుదల కనిపించింది. దేశంలో నమోదైన తాజా కేసులతో కలుపుకుంటే 12,72,073కు చేరింది. ఈ కేసుల ఇంకా క్రియాశీలంగా ఉండగా, రోజువారీ పాజిటివ్ రేటు 14.78 శాతంగా ఉంది. 
 
దేశంలో కరోనా వైరస్ మళ్ళీ ప్రతాపం చూపిస్తుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి రోజున ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లోని గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలపై నిషేధం విధించింది. 

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments