1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (11:22 IST)

ఒమిక్రాన్ విజృంభణ: 5,488కి చేరిన పాజిటివ్ కేసులు

కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 5,488కి చేరింది. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య అత్యధికంగా 1,367కు చేరుకుంది.
 
రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479, బెంగాల్‌లో 294, ఉత్తర్‌ప్రదేశ్‌లో 275, తెలంగాణలో 260, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, ఒడిశాలో 169, హర్యానాలో 162 కేసులు నమోదైనాయి. 
 
ఇక ఏపీలో 61, మేఘాలయలో 31, బీహార్‌, పంజాబ్‌ 27, జమ్మూకాశ్మీర్‌లో 23, గోవాలో 21, మధ్యప్రదేశ్‌లో 10 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు కూడా రోజూ భారీగా నమోదవుతున్నాయి.