Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 15 జూన్ 2022 (10:22 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపించినప్పటికీ బుధవారం మాత్రం మళ్లీ పెరిగిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు మంగళవారం 6594 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం గణాంకాల ప్రకారం 8822 కేసులు పెరిగాయి. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం 33.7 శాతం మేరకు పెరిగాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,32,45,517గా ఉంది. 
 
అలాగే, 4,26,67,008 మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 5,24,792 మంది మరణించారు. బుధవారం కరోనా వైరస్ బాధితుల్లో 15 మంది చనిపోయారు. 5718 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు. 

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments