దేశంలో కొత్తగా మరో 8 వేల కరోనా పాజిటివ్ కేసులు

మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:18 IST)
దేశంలో కొత్తగా మరో ఎనిమిది వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో గడిచిన 24 గంటల్లో 8,586 మందికి ఈ వైరస్ సోకినట్టు వెల్లడించింది. మరో 48 మంది కరోనా బాధితులు చనిపోయారు. గత 24 గంటల్లో 9,650 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,43,57,546కు చేరగా, ఇందులో 4,37,33,624 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,27,416 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 210.31 కోట్ల మందికి ఈ టీకాలను పంపిణీ చేశారు. 

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments