దేశంలో కొత్తగా మరో 8 వేల కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:20 IST)
దేశంలో కొత్తగా మరో ఎనిమిది వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో గడిచిన 24 గంటల్లో 8,586 మందికి ఈ వైరస్ సోకినట్టు వెల్లడించింది. మరో 48 మంది కరోనా బాధితులు చనిపోయారు. గత 24 గంటల్లో 9,650 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,43,57,546కు చేరగా, ఇందులో 4,37,33,624 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,27,416 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 210.31 కోట్ల మందికి ఈ టీకాలను పంపిణీ చేశారు. 

అన్నీ చూడండి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

Madhav's look : యుద్ధంలో పోరాడినట్లుగా మారెమ్మ నుంచి మాధవ్ లుక్

తర్వాతి కథనం
Show comments