బుధవారం, 5 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జనవరి 2025 (13:04 IST)

రాజ్‌కోట్ టీ20కి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఇదే...

cricket ground
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య స్వదేశంలో ట్వంటీ20 టోర్నీ జరుగుతుంది. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్ మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం పర్యాటక ఇంగ్లండ్ జట్టు తమ జట్టును ప్రకటించింది. 
 
రెండో టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచుకు కూడా కొనసాగించనున్నట్టు తెలిపింది. మూడో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 
 
కాగా, రెండో టీ20లో ఇంగ్లీష్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బ్రైడన్ కార్స్, జేమీ స్మిత్ ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో అరంగేట్రం చేశారు. కార్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 
 
17 బంతుల్లో 31 రన్స్ బాదిన అతడు.. బౌలింగ్‌లో మూడు వికెట్లు కూడా తీశాడు. అటు స్మిత్ కూడా 12 బంతుల్లో 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వీరిద్దరూ గాస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్ స్థానంలో జట్టులోకి వచ్చారు.
 
'మేము సిరీస్‌లో వెనకబడిపోయాం. కనుక తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నాం. అందుకే రెండో టీ20లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న జట్టునే మూడో టీ20కి కూడా కొనసాగించాలని నిర్ణయించాం' అని ఇంగ్లండ్ క్రికెట్ మూడో టీ20 కోసం 'ప్లేయింగ్ ఎలెవన్'ను ప్రకటించిన తమ ప్రకటనలో పేర్కొంది.