రిషబ్ పంత్ అదరగొట్టేశాడు.. కష్టాలు ఎవరికి?

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (10:49 IST)
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడటంతో.. అతడు తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సాహాకు కష్టాలు తప్పవని సమాచారం. న్యూజిలాండ్ లెవన్ జట్టుతో ఈ నెల 14వ తేదీన ఆరంభమైన మూడు రోజుల క్రికెట్ టెస్టు మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన భారత జట్టు 263 పరుగులు సాధించింది. 
 
వికారి 101 పరుగులు, పుజారా 93 పరుగులు సాధించారు. తదనంతరం బరిలోకి దిగిన కివీస్ లెవన్ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. అటుపిమ్మట రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 70 పరుగులు సాధించాడు. ఇందులో 4 సిక్సర్లు వున్నాయి. 
 
టీమిండియా ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ మెరుగ్గా రాణించలేకపోయాడు. అయితే ప్రస్తుత మ్యాచ్‌లో నిలకడగా ఆడిన కారణంగా ఈ నెల 21వ తేదీ నుంచి కివీస్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వికెట్ కీపర్‌గా వున్న సాహెల్‌కు కష్టాలు తప్పవని.. అతనిని తొలగించి అతని స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకునే ఛాన్సుందని తెలుస్తోంది.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments