Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిసెలో ఎంపిటిసి, పెళ్ళయిన మహిళలతో రొమాన్స్ చేస్తూ...

Written By జె
Updated: శనివారం, 2 అక్టోబరు 2021 (22:49 IST)
బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తి అతను. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డాడు. ఎవరైనా చెడు మార్గంలో నడుస్తుంటే వారికి మంచి మాటలు చెప్పాలి. అలాంటి వ్యక్తి పెళ్ళయిన ఆంటీలనే టార్గెట్ చేసుకుని వారిని లోబరుచుకుని ఎంజాయ్ చేసేవాడు. వారికి డబ్బుల ఆశ చూపించి వారితో శారీరక సంబంధాన్ని పెట్టుకునేవాడు. ఎన్నో రోజులు ఆ సంబంధం కొనసాగదుగా.. అడ్డంగా దొరికిపోయాడు.
 
తెలంగాణా రాష్ట్రం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో ఉండే ఎంపిటీసీ స్థానికంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. వివాహమై భర్తలకు దూరంగా ఉండే వివాహితులతోను, అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న మహిళలకు దగ్గరవుతూ ఉండటం ఇతనికి ఉన్న అలవాటు. 
 
వారికి డబ్బులు ఆశ చూపించి.. లేకుంటే ప్రభుత్వ పథకాలు వచ్చేలా చేస్తానంటూ హామీలను ఇస్తూ వారికి దగ్గరవుతూ ఉంటాడు. ఇలా మొత్తం ఐదుగురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఊరి పొలాల్లోనే తన పని కానిచ్చేవాడు ఎంపిటీసీ. 
 
అంతేకాదు పశువులను కట్టే ప్రాంతంలోను, గొర్రెలు తిరిగే ప్రాంతంలోనే శృంగారం చేసేవాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతూ ఉండేవాడు. అయితే ఎక్కువ రోజులు ఆ విషయం దాగదుగా. ఒక పశువుల కాపరికి ఎంపిటీసీ అడ్డంగా దొరికాడు. 
 
ఎంపిటీసీ లీలలను సెల్ ఫోన్లో తీసిన ఆ పశువుల కాపరి ఊరి మొత్తానికి ఆయన బాగోతాన్ని చూపించేశాడు. దీంతో అసలు విషయం ఎంపిటిసి తెలియడమే కాదు తాను మోసం చేస్తూ లోబరుచుకుంటున్న మహిళలకు బయటకు వచ్చి అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి కటాకటాల పాలయ్యాడు.

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments