రేణిగుంటలో దారుణం : కుమార్తెపై తండ్రి అత్యాచారం

సోమవారం, 1 నవంబరు 2021 (08:12 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న రేణిగుంటలో ఓ దారుణం జరిగింది. 14 యేళ్ల కన్న కూతురిపై ఓ కామాంధ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేణిగుంట మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను తిరుపతిలో వైద్యపరీక్షల కోసమని అక్టోబరు 24వ తేదీన ఇంటి నుంచి తీసుకెళ్లాడు. 
 
ఆపై రేణిగుంట, తిరుపతి మార్గంలోని లక్ష్మీపురం కాలనీకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి ఆలస్యంగా చెప్పడంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

Trikala Review: కర్మానుసారమే మంచి చెడు అని చెప్పే త్రికాల మూవీ రివ్యూ

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

Alia Bhatt : ఆల్ఫా లో ఆలియా భ‌ట్, శ‌ర్వారి భారీ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ వుంటాయి: బాబీ డియోల్

తర్వాతి కథనం
Show comments