శ్రీలంకలో ఉగ్రదాడులు... 100 మందికి పైగా మృతి

ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (11:51 IST)
శ్రీలంక రాజధాని కొలంబోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని రెండు ప్రార్థనా మందిరాల్లో, హోటల్స్‌ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. బాంబు పేలుళ్లలో దాదాపుగా 100 మందికి పైగా చనిపోగా, వందలాది మంది మృతి గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రుల్లో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాడు. పరిసర ప్రాంతాల్లోని భవనాలకు పగుళ్లు వచ్చాయి. 
 
తొలుత బట్టికలోవా ప్రాంతంలోని ఓ చర్చిలో పేలుడు సంభవించింది. ఆపై, హోటల్ షాంగ్రీలా, హోటల్ సినామోన్ గ్రాండ్‌లో కూడా పేలుళ్లు చోటుచేసుకునాన్నాయి. ఆపై సెయింట్ ఆంథోనీ ప్రార్థనామందిరం, సెయింట్ సెబాస్టియన్ చర్చిల్లోనూ విస్ఫోటనం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనల్లో ఉండగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతాలు క్షతగాత్రులతో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా, ఓ వ్యక్తి కదలిక లేకుండా పడివుండగా, పక్కనే ఓ చిన్నారి అత్యంత దీనంగా ఏడుస్తుండడం అందరినీ కలచివేస్తోంది. 

అన్నీ చూడండి

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments