1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (09:34 IST)

భారత్‌లో 1993 కరోనా పాజిటివ్ కేసులు.. 73మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారత్‌లో గురువారం మాత్రం అత్యధికంగా 1993 పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 35వేలు దాటింది.
 
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 73 మంది మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,043కు చేరుకోగా.. మొత్తం 1147 మంది మరణించినట్లైంది. దేశంలో రికవరీ రేటు 25.36 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 8889 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
 
ఇకపోతే.. మహారాష్ట్రలో అత్యధికంగా 10,498 కరోనా కేసులు నమోదు కాగా, 459 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 4,395, ఢిల్లీలో 3,515, మధ్యప్రదేశ్‌లో 2,660, రాజస్తాన్‌లో 2,584, తమిళనాడులో 2,323, ఉత్తరప్రదేశ్‌లో 2,203 కరోనా కేసులు నమోదయ్యాయి.