ఢిల్లీలో మణిపూర్ విద్యార్థి జింగ్రామ్ దారుణ హత్య!
ఢిల్లీలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కు చెందిన విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ విద్యార్థి పేరు జింగ్రామ్గా గుర్తించారు. నెల రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన ఈ విద్యార్థి గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. నెలరోజుల క్రితం మణిపూర్ నుంచి ఢిల్లీకి వచ్చి హతమయ్యాడు.
ఇటీవల బెంగళూరులో మణిపూర్ విద్యార్థులు కన్నడం మాట్లాడలేదని కొందరు బెంగుళూరు యువకులు దాడి చేసి గాయపరిచిన విషయం తెల్సిదే. అలాగే, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మణిపూర్కి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు తాజాగా మరో మణిపూర్ విద్యార్థి హత్యకు గురయ్యాడు.
మణిపూర్కి చెందిన జింగ్రామ్ కెన్గో (33)ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని కోట్ల ముబారక్పూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ హత్య దొంగతనం చేయడానికి వచ్చిన వారు చేసినట్టుగా అనిపించడం లేదని, ఒక పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్టు ఉందని పోలీసులు అంటున్నారు. ఈ హత్య సమాచారాన్ని పోలీసులు జింగ్రామ్ కుటుంబ సభ్యులకు చేరవేశారు.