ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డని... భర్తను గొంతుకోసి చంపిన భార్య
ప్రియుడితో తన తిరుగుళ్లకు భర్త అడ్డుగా నిలిచాడు. పైగా తామిద్దరం కలిసి ఉండడాన్ని చూసేశాడు. మందలించాడు. ఇదే ఆమెను రోజూ వేధించసాగింది. ఎలాగైనా సరే భర్త అడ్డుతొలగించుకుని తాము తిరగాలని భావించింది. తన ప్రియుడితో కలసి భర్తను అంతం చేసేందుకు పథకం వేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిద్రపోతున్న భర్త గొంతు కోసి హత్య చేశారు. ఆపై ఏమి తెలియనట్లు ఉండిపోయారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు. ఢిల్లీలోజరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చిన సుమిత్రకు బాబులాల్కు 2009లో వివాహం జరిగింది. అర్జున్ కూడా ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చి సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అయితే సుమిత్ర పెళ్లికి ముందే అర్జున్తో స్నేహంగా ఉండేది. అతను కూడా బాబులాల్, సుమిత్రలతో కలిసి ఉండేవాడు. వీరిద్దరిపై అనుమానం వచ్చి ఒకరోజు గట్టిగా మందలించాడు.
అర్జున్ను ఇంటినుంచి బయటకు పంపేశాడు. దాంతో తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి చంపాలనుకుంది. అందులోభాగంగానే వీరద్దరూ పథకం ప్రకారం అతన్ని హతమార్చారు. ఒకరోజు ప్రియుడికి ఫోన్ చేసి జూన్ 19న ఇంటికి రమ్మని పిలిచింది. భర్త బాబులాల్ నిద్రిస్తున్న సమయంలో వాడియైన ఆయుధంతో గొంతుకోశారు.
మృతదేహం వద్ద హత్యకు వాడిన ఆయుధం, మొబైల్ ఫోన్, రక్తపు మరకలతో ఉన్న బట్టలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆ నిందితులిద్దరూ గుట్టువిప్పారు.