వణికించే కుజదోషం, నివారణకు ఏం చేయాలి? (Video)

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (20:49 IST)
కుజ దోషం వుంటే వివాహానికి అడ్డంకులు ఏర్పడుతుంటాయన్నది విశ్వాసం. అందుకే కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాళి రోజు 9సార్లు 12 రోజులు పారాయణ చేసి వల్లీ, దేవసేనా అష్టోత్తర శతనామాలు ఒకసారి చదవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యమాలా మంత్రము రోజుకొకసారి 40 రోజులు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. 
 
ఏడు మంగళవారములు ఉదయం ఆరు గంటల నుంచి ఏడుగంటల లోపున శివాలయంలో ఏక రుద్రాభిషేకం చేయించడం ద్వారా కుజదోషాన్ని నివారించవచ్చు. ఏడు మంగళవారములు కుమార స్వామికి గానీ, నాగేంద్రస్వామి పుట్టకుగాని 70 ప్రదక్షిణలు చేస్తే కుజదోషాన్ని పోగొట్టుకోవచ్చంటున్నారు.
 
ఆదివారం రాహుకాలములో సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటలోపుగా నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేసి సుబ్రహ్మణ్యష్టకం పారాయణం చేయాలి. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు పుట్టమన్ను చెవికి కచ్చితముగా పెట్టుకోవాలి. పాలుపోయాలి. కొబ్బరికాయ కొట్టాలి. 
 
శనివారం ఉదయం 9-30 నుంచి 11 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటల వరకు, సోమవారం ఉదయం 7-30 నుంచి 9-00 గంటల వరకు.. రాహుకాలములో అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన ఎర్రటి వత్తులతో చేసినట్లైతే చాలా మంచిది. కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రమును దర్శించి 70 ప్రదక్షిణములు చేసి వెండి సర్ప పడగను హుండీలో వేసి అభిషేకం చేయించుకొనవలెను.
 

అన్నీ చూడండి

జగన్మోహన్ రెడ్డి MAVIGUN ప్రతిపాదనను తప్పుబట్టిన రవి కుమార్

Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే

టేకు ఆకుల కోసం అడవికి వెళ్లిన నలుగురు మహిళల మృతి.. చంపింది ఎవరు?

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు బందర్ రోడ్డులో థార్ జీపులతో బీభత్సం, వీడియో

జగన్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం..

అన్నీ చూడండి

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

22-05-2026 శుక్రవారం ఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

తర్వాతి కథనం
Show comments