లాక్ డౌన్.. ఉదయం పూట సూర్య నమస్కారం చేస్తే..?

Written By సెల్వి
Updated: సోమవారం, 30 మార్చి 2020 (17:46 IST)
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలు.. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. దొరికిన సమయాన్ని మంచి పనుల కోసం కరోనా సోకకుండా జాగ్రత్త పడేందుకు ఉపయోగించాలంటున్నారు.. వైద్యులు. 
 
ఇక ఆధ్యాత్మిక పండితులైతే.. లాక్ డౌన్ నుంచి బద్ధకం పెరిగిపోకుండా వుండాలంటే.. సూర్య నమస్కారం తప్పక చేయండి అంటున్నారు. ఇలా చేయడం ద్వారా శరీరానికి డి విటమిన్ లభించడమే కాకుండా.. శరీరం చురుకుగా పనిచేస్తుందని వారు చెప్తున్నారు. సాధారణంగా సూర్య భగవానుడికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వవనేది ఆధ్యాత్మిక పండితుల వాక్కు. 
 
సూర్యభగవానుడి రథానికి ఒకే అశ్వం ఉంటుందనీ, దాని పేరే 'సప్త' అని అంటారు. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందనీ, అదే కాల చక్రం అని చెబుతారు. ఆ చక్రానికి గల 12 ఆకులే మాసాలని అంటారు. అలాంటి సూర్యభగవానుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో పేరుతో పిలవబడుతుంటాడు.
 
సూర్యభగవానుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి, ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి. సకల జీవరాశులకు పోషకుడైన సూర్యభగవానుడిని పూజించడం మరిచిపోకూడదని మహర్షులు కూడా చెప్తున్నారు. అందుకే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానమాచరించి.. సూర్య నమస్కారం చేయడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుందని, శరీరానికి కావలసిన విటమిన్లు కూడా లభిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.     

అన్నీ చూడండి

Gen Z: 21 ఏళ్లలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో యువత పోటీ.. జెన్-జెడ్‌కు రేవంత్ మద్దతు (video)

Kazipet: కాజీపేట-విజయవాడ మధ్య ట్రిపుల్ లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్త పది కోవిడ్ కేసులు నమోదు

భారతదేశంలోని వృద్ధుల కోసం మూడు కొత్త ఆవిష్కరణలు: అన్వయా కిన్ కేర్

జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)

అన్నీ చూడండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments