Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారాహి దేవికి పెసళ్లతో దీపం వెలిగిస్తే..? (video)

Written By సెల్వి
Updated: బుధవారం, 26 జులై 2023 (22:33 IST)
సాధారణంగా వారాహి రూపంలో వుండే వారాహి దేవత సప్తకన్యల్లో ఒకరు. ఆమె కారు మేఘం వంటి రూపంలో వుంటుందని దేవీ భాగవతంలో చెప్పబడుతోంది. ఈ వారాహి దేవిని పూర్వకాలంలో రహస్యం రాజులు, మంత్రులు, సైనికులు, మాంత్రికులు, తాంత్రికులు, శత్రువులు వుండేటటువంటి వారు కొలిచేవారట.
 
ప్రస్తుతం ఆమెను మాసాల్లో వచ్చే పంచమి నాడు భక్తులు కొలవడం చేస్తున్నారు. కలియుగంలో వారాహి రూపంలో వున్న ఈ మాతను పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఈమె మహా విష్ణువు అంశం. అలాంటి ఆమెను కొలిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి. 
 
ఇక మీ కోరికలు సులభంగా నెరవేరాలంటే ఈ పరిహారాన్ని ఇంట్లో చేయవచ్చు అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. వారాహి అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు తప్పక నెరవేరుతాయి. ఈ పరిహారాన్ని ఇంట్లో కానీ లేకుంటే వారాహి అమ్మవారు కొలువై వుండే ఆలయలోనూ చేయవచ్చు. ఇంతకీ ఆ పరిహారం ఏంటో చూద్దాం. 
 
పెసళ్లను ఓ ప్లేటులోకి తీసుకుని చదునుగా చేసుకోవాలి. వారాహిదేవి పటం ముందు ఈ పెసళ్లతో నింపిన ప్లేటును వుంచి.. దానిపై రెండు ప్రమిదలతో నేతి దీపం లేకుంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా తొమ్మిది రోజులు వరుసగా ఈ దీపాన్ని వెలిగించి.. వారాహి అమ్మవారిని పూజించాలి.
 
ఇలా చేస్తే మీ సంకల్పం సిద్ధిస్తుందని వారాహి దేవి ఉపాసకులు చెప్తున్నారు. ఈ దీపం వెలిగించడం ద్వారా వారాహి దేవి అనుగ్రహం లభిస్తుంది. తొమ్మిది రోజుల తర్వాత ఈ పెసళ్లను ఆవులకు మేతగా ఇవ్వడం లేదా.. చెరువుల్లో వేయడం చేయొచ్చు.
 

అన్నీ చూడండి

Nallari Kiran Kumar Reddy: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కనుందా?

నాన్న తాగే ప్రోటీన్ షేక్‌లో రసాయనాలు కలిపి చంపేశాడు.. అమ్మను హింసించాడు..

మద్యం మత్తులో ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై..?

హాస్టల్ వార్డెన్ ఎంత పని చేసింది.. పెళ్లికి విద్యార్థినులను తీసుకెళ్లి.. డ్యాన్స్ చేయించింది..

ఆటోరిక్షాను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. పల్నాడులో ఏడుగురు మృతి

అన్నీ చూడండి

కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ

25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

తర్వాతి కథనం
Show comments