Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవ సమాధులను ఏ రోజు దర్శించుకోవాలి.. అదీ సోమవారం..?

Written By సెల్వి
Updated: శనివారం, 31 అక్టోబరు 2020 (18:10 IST)
సిద్ధులు, యోగులు జీవ సమాధి అవుతారని వినే వుంటాం. అయితే అలాంటి జీవ సమాధులు వెలసిన క్షేత్రాలను పూజించడం చేయవచ్చా..? జీవ సమాధులను దర్శించుకోవడం.. పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయి..? ఇంకా జీవ సమాధులను ఏ సమయంలో పూజించాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి.
 
న్యాయమైన, నీతి నిజాయితీతో కోరిన కోర్కెలు.. సోమవారం ఉదయం ఏడు గంటల్లోపు లేదంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది సోమవారాలు దర్శించుకోవడం, పూజించడం చేయాలి.
 
కులదైవం ఏమిటో తెలియనివారు, కులదైవ కోపానికి గురైనవారు, కులదైవ పూజ చేయని వారు, కులదైవాన్ని శుభ్రం మరిచిపోయిన వారు.. ఇలాంటి చర్యలతో ఇబ్బందులు, ఈతిబాధలు ఎదుర్కొనే వారు.. మంగళవారాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లో జీవ సమాధులను దర్శించుకుని నేతి దీపం వెలిగించి.. అగరవత్తులు ధూపమేయాలి. ఇలా ఎనిమిది వారాలు జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది.
 
వ్యాపారాల్లో అభివృద్ధి పొందాలనుకునేవారు.. ఉద్యోగాల్లో రాణించాలనుకునేవారు, ఆర్థికాభివృద్ధి పొందాలనుకునేవారు.. జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది. ఇలాంటి వారు బుధవారాల్లో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది వారాలు చేయాలి.
 
అలాగే గురువారాల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకు జీవ సమాధులు ఉపయోగపడతాయి. ఉద్యోగ రీత్యా ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనుకునేవారు.. శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు జీవ సమాధిని దర్శించుకోవడం మంచిది. ఇలా ఎనిమిది శుక్రవారాలు చేయాలి.
 
అలాగే శనివారాల్లో జీవ సమాధులను దర్శించుకుంటే.. కుటుంబ సమస్యలు, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కోర్టు వివాదాలు, న్యాయస్థానాల సమస్యలు తొలగిపోవాలంటే.. ఆదివారం జీవ సమాధులను దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఆదివారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి.
 
ఇంకా జీవసమాధులను దర్శించుకునేవారు ఎవరైనా.. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం. ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోని ఏదైనా జీవ సమాధిని దర్శించుకోవడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. 
 
ఇంకా ఎనిమిది వారాల పాటు జీవ సమాధులను దర్శించుకుంటేనే సకలసుఖ సంతోషాలను పొందవచ్చు. కానీ ఎనిమిది వారాలు జీవ సమాధులను వరుసగా దర్శించుకున్నాక.. నెలకోసారి మూడు నెలలకు ఓసారి మాత్రమే దర్శించుకుంటే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

సెప్టెంబర్ 11, 2026: ఏపీ, తెలంగాణల్లో దంచికొట్టనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

చెంబూరులో అలాంటి స్థితిలో 20 పిల్లులు మృతి.. సమాచారం ఇస్తే రూ.50వేలు కానుక

ఇంద్రాయణీ నదీ తీరం వద్ద పిచ్చకొట్టుడు కొట్టుకున్న హిజ్రాలు, వీడియో

స్కూల్ లీవ్ ఇస్తారని తోటి విద్యార్థిని చంపబోయిన స్టూడెంట్స్...ఎక్కడ?

తోతాపురి మామిడి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. అదేంటంటే?

అన్నీ చూడండి

11-09-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. ఆరోగ్యంపై శ్రద్ధ.. విశ్రాంతి అవసరం..

10-09-2026 గురువారం మీ రాశి ఫలితాలు.. పనిభారం పెరుగుతుంది

సర్వ శుభాలను చేకూర్చే మహాగణపతిం మనసా స్మరామి

09-09-2026- బుధవారం మీ రాశి ఫలితాలు.. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

తర్వాతి కథనం
Show comments