ఆలయాల్లో తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా..?

శుక్రవారం, 9 నవంబరు 2018 (11:52 IST)
ఆలయాలకు వెళ్లాలంటే ఇష్టపడని వారుండరు. సాధారణంగా ఆలయాలకు వెళ్లినప్పుడు పూజ పూర్తయిన తరువాత తీర్థాన్ని ఇస్తారు. అదీ ఒక్కటి కాదు రెండు కాదు మూడుసార్లు ఇస్తారు. అలా ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం..
 
మెుదటిసారి తీసుకునే తీర్థం శరీరశుద్ధికి, రెండవ సారి తీసుకునేది ధర్మసాధనకు, మూడోసారి తీసుకునేది పరమపదం కోసమని పండితులు చెబుతున్నారు. అలానే కొన్ని ఆలయాల్లో ఆ తీర్థాన్ని రాగి పాత్రలో ఇస్తుంటారు. రాగి పాత్ర ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో.. అదేవిధంగా పూజలకు అంతే మంచి చేస్తుందని విశ్వాసం. 
 
చాలామంది తీర్థం తీసుకున్న తరువాత దానిని తాగి ఆ తీర్థాన్ని తలకు అంటుకుంటారు. అలా చేస్తే పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం. కానీ, అది నిజం కాదు.. అసలు తీర్థాన్ని తలకు అంటకూడదు. ఆలయాల్లో తీర్థం ఎందుకు ఇస్తారంటే.. దానిని ఎవరైతే తీసుకుంటున్నారో వారికి గల దోషాలు, పాపాలు తొలగిపోవాలని ఇస్తారు.

కానీ, తీసుకునే వారు మాత్రం వాటిని తొలగించుకోకుండా.. తలకు అంటుకుంటుంటారు. ఇలా చేస్తే మీ దోషాలు, పాపాలు ఇంకా ఎక్కువవుతాయని నిపుణులు చెప్తున్నారు. కనుక తీర్థం తీసుకున్న తరువాత దానిని తాగి మీ వస్త్రాలతో శుభ్రం చేసుకోండి. 

అన్నీ చూడండి

Rowdy Sheeter: రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్య

గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం ప్రారంభం

సింగపూర్‌లో వజ్రం చోరీ కేసు : భారతీయుడికి రెండేళ్ల జైలు...

సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదు : భారత్

అన్నీ చూడండి

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments