ఆలయాల్లో తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా..?

శుక్రవారం, 9 నవంబరు 2018 (11:52 IST)
ఆలయాలకు వెళ్లాలంటే ఇష్టపడని వారుండరు. సాధారణంగా ఆలయాలకు వెళ్లినప్పుడు పూజ పూర్తయిన తరువాత తీర్థాన్ని ఇస్తారు. అదీ ఒక్కటి కాదు రెండు కాదు మూడుసార్లు ఇస్తారు. అలా ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం..
 
మెుదటిసారి తీసుకునే తీర్థం శరీరశుద్ధికి, రెండవ సారి తీసుకునేది ధర్మసాధనకు, మూడోసారి తీసుకునేది పరమపదం కోసమని పండితులు చెబుతున్నారు. అలానే కొన్ని ఆలయాల్లో ఆ తీర్థాన్ని రాగి పాత్రలో ఇస్తుంటారు. రాగి పాత్ర ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో.. అదేవిధంగా పూజలకు అంతే మంచి చేస్తుందని విశ్వాసం. 
 
చాలామంది తీర్థం తీసుకున్న తరువాత దానిని తాగి ఆ తీర్థాన్ని తలకు అంటుకుంటారు. అలా చేస్తే పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం. కానీ, అది నిజం కాదు.. అసలు తీర్థాన్ని తలకు అంటకూడదు. ఆలయాల్లో తీర్థం ఎందుకు ఇస్తారంటే.. దానిని ఎవరైతే తీసుకుంటున్నారో వారికి గల దోషాలు, పాపాలు తొలగిపోవాలని ఇస్తారు.

కానీ, తీసుకునే వారు మాత్రం వాటిని తొలగించుకోకుండా.. తలకు అంటుకుంటుంటారు. ఇలా చేస్తే మీ దోషాలు, పాపాలు ఇంకా ఎక్కువవుతాయని నిపుణులు చెప్తున్నారు. కనుక తీర్థం తీసుకున్న తరువాత దానిని తాగి మీ వస్త్రాలతో శుభ్రం చేసుకోండి. 

అన్నీ చూడండి

చారిత్రాత్మక విక్రమ్-1 ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం

సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నాలెజినోవా

గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం ద్వారా నార్కో-టెర్రర్‌ను నిర్మూలిస్తాం: హోం మంత్రి అమిత్ షా

కోవిడ్ కేసులు: కేరళలో 115, కర్నాటక 64, ఏపీలో 13 మాత్రమే, కానీ అప్రమత్తం

జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ

అన్నీ చూడండి

18-07-2026 శనివారం ఫలితాలు - శ్రీమతి వైఖరిలో మార్పు...

17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..

Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..

శ్రీనివాసమంగాపురంలో జూలై 17 నుండి వార్షిక సాక్షాత్కార వైభవోత్సవాలు

ఆషాఢ బోనాల ఉత్సవాలు.. కుమ్మర కులస్తుల తొలి బోనాల సమర్పణ

తర్వాతి కథనం
Show comments