మహాశివరాత్రి ఉపవాసం వుంటే.. ఇవి తినకూడదట..

బుధవారం, 10 మార్చి 2021 (12:04 IST)
మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం తప్పనిసరి. శివరాత్రికి ముందు రోజు ఒకవేళ భోజనం చేసి.. సుఖభోగాలకు దూరంగా వుండాలి. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. సూర్య నమస్కారం చేయాలి. శివపూజ చేయాలి. ఆపై ఆలయాల్లో శివ దర్శనం చేసుకోవాలి. ధ్వజస్తంభం లేని ఆలయంలో సాష్టాంగ నమస్కరించకూడదు.
 
మహాశివరాత్రి రోజున శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. తెల్లవారున శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. వీలైతే ఆలయాల్లో జరిగే పూజల్లో పాలు పంచుకోవచ్చు.
 
మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. వ్రతం పాటిస్తే గనక శివరాత్రి రోజున వరి అన్నం, గోధుమలు, పప్పులు వంటివి తినకూడదు. వాటి బదులు పండ్లు, పాలు వాడాలి. చాలా మంది భక్తులు రాత్రంతా పూజ చేస్తారు. ఎంత నిష్టగా చేస్తే అంత మంచి ఫలం దక్కుతుందని ప్రతీతి.

అన్నీ చూడండి

నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితుడు రీనీట్ రాసేందుకు అనుమతి... ఎలా?

కార్పొరేట్ ఉద్యోగానికి కాదని ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి...

నీట్ రీ-టెస్ట్ భద్రత ఏర్పాట్లపై అన్నామలై మండిపాటు.. పరీక్షా సమయం పెంపుపై అభ్యంతరం

అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక - అత్యంత ఖరీదైన మామిడి పండు సమర్పణ

హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

తర్వాతి కథనం
Show comments