వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే శ్రీవారి దర్శనం : తితిదే

ఆదివారం, 3 అక్టోబరు 2021 (13:58 IST)
ఈ నెలలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీంతో భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఏవైనా దర్శనం టికెట్లు కలిగి, వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్, దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ పీసీఆర్ పరీక్ష నెగటివ్ రిపోర్టు ఉంటేనే భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని తేల్చిచెప్పింది. 
 
బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాటపై సమీక్షించేందుకు శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు, టీటీడీ సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని గోపినాథ్ కోరారు. అదేసమయంలో తితిదే అధికారులు తీసుకునే చర్యలకు కొండపైకి వచ్చే భక్తులు కూడా సహకారం అందించాలని తితిదే అధికారులు కోరారు. 

అన్నీ చూడండి

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

అన్నీ చూడండి

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments