శ్రీవారి క్యాలెండర్లు - డైరీలపై జీఎస్టీ ప్రభావం... పెరిగిన ధరలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఫోటోలతో టీటీడీ బోర్డు ముద్రించే వార్షిక క్యాలెండర్లు, డైరీలకు ప్రత్యేక పేరు, గుర్తింపు ఉంది. ముఖ్యంగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతి శ్రీవారి భక్తుడు పోటీపడుతుంటాడు. అయి

శనివారం, 16 సెప్టెంబరు 2017 (10:41 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఫోటోలతో టీటీడీ బోర్డు ముద్రించే వార్షిక క్యాలెండర్లు, డైరీలకు ప్రత్యేక పేరు, గుర్తింపు ఉంది. ముఖ్యంగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతి శ్రీవారి భక్తుడు పోటీపడుతుంటాడు. అయితే, ఈ యేడాది ఈ క్యాలెండర్లు, డైరీలపై జీఎస్టీ పన్నుభారం బాగా పడింది. ఫలితంగా వీటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 
 
ప్రతి యేడాది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి డైరీలు, క్యాలెండర్లను వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఆవిష్కరించడం ఆనవాయితీ. అలాగే, ఈ యేడాది, ఈనెల 23వ తేదీ రాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. ఆ వెంటనే విక్రయాలు ప్రారంభించాలని తితిదే నిర్ణయించింది. 
 
ఇందుకోసం 12 పుటల క్యాలెండర్లు 20 లక్షలు, డైరీలు 10 లక్షలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి ఫొటోలతో పెద్ద క్యాలెండర్లు వేర్వేరుగా 14 లక్షలు, శ్రీనివాసుడు, అమ్మవారి చిన్న క్యాలెండర్లు, పంచాగం క్యాలెండర్లు సిద్ధం చేశారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ప్రభావంతో డైరీలు, క్యాలెండర్ల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు. 12 పుటల క్యాలెండర్‌ ధర రూ.75 నుంచి 100; డైరీ ధర రూ.100 నుంచి రూ.120కు పెంచినట్టు వారు వివరించారు. 

అన్నీ చూడండి

కాలి నడకన తిరుమలకు 116 యేళ్ల వృద్ధురాలు.. 6న వీఐపీ బ్రేక్ దర్శనం

సెల్‌‍ఫోన్ వెలుతురో ఆర్టీసీ బస్సుడ్రైవింగ్... గాల్లో ప్రయాణికుల భద్రత

నా కొడుకును కిడ్నాప్ చేసి.. నాపై అత్యాచారం చేశాడు.. షౌకత్ మొల్లాపై మహిళ ఫిర్యాదు

ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ- ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

ఖమేనీ అంత్యక్రియల్లో ప్రజల కన్నీళ్లు నకిలీ అయి వుండొచ్చు.. ట్రంప్

అన్నీ చూడండి

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

తర్వాతి కథనం
Show comments