శ్రీవారికి కొత్త కళ: జయవిజయల నుంచే స్వామి విగ్రహం వెలిగిపోతోంది

తిరుమల శ్రీవారికి కొత్త కళ వచ్చేసింది. భక్తుల కోరిక మేరకు శ్రీవారు ఇక స్పష్టంగా కనిపిస్తారు. ఎందుకంటే.. ఇక శ్రీవారు మరింత కొత్తవెలుగుతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ మేరకు భక్తుల సూచనల ప్రకారం గర్భగుడ

బుధవారం, 14 మార్చి 2018 (17:10 IST)
తిరుమల శ్రీవారికి కొత్త కళ వచ్చేసింది. భక్తుల కోరిక మేరకు శ్రీవారు ఇక స్పష్టంగా కనిపిస్తారు. ఎందుకంటే.. ఇక శ్రీవారు మరింత కొత్తవెలుగుతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ మేరకు భక్తుల సూచనల ప్రకారం గర్భగుడిలో నేతి దీపాల కాంతిని టీటీడీ పెంచింది. దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు ఏకాంగులను నియమించి దీపకాంతి తగ్గకుండా పర్యవేక్షణ చేయిస్తోంది. 
 
తిరుమల వెంకన్నను గర్భగుడిలో శ్రీవారిని భక్తులు కేవలం కొన్ని క్షణాలు మాత్రమే దర్శించగలుగుతున్నారు. అలాంటి మనోహరమైన రూపం మరింత వెలుగులో చూసి తరించేలా చేశారు. ఆగమ నియమానుసారం శ్రీవారి గర్భగుడిలో విద్యుత్ దీపాలను వెలిగించకూడదనే నియమం వుంది. నేతి దీపాల వెలుగులోనే స్వామిని దర్శించుకోవాల్సి వుంటుంది. 
 
దీపకాంతి తగ్గకుండా మూలమూర్తికి పైభాగంలో వేలాడదీసిన రెండు దీపకుండీలతో పాటు కిందిభాగంలోని మరో రెండు దీపకుండీలలో వేకువజామున సుప్రభాత సేవలో, మధ్యాహ్యం 11గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు తోమాల సమయంలో నెయ్యిని నింపి కాంతి తగ్గకుండా చర్యలు తీసుకున్నారు. జయవిజయల నుంచే స్వామి విగ్రహం స్పష్టంగా కనిపిస్తుండటంతో భక్తులు సంతోషిస్తున్నారు.

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments