Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధ్యాత్మిక వాస్తు చిట్కాలను పాటిస్తే?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని బ్రహ్మ స్థానం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో బరువైన యంత్ర సామాగ్రి గాని లేదా బరువైన వస్తువులను కాని ఉంచకూడదు. ఒకవేళ గనుక ఉంటే వాటిని తీసివేయడం మంచిది. అవి ఆ స్థానంలోనే ఉంటే, అవి వ్యాపార లాభాలపై తీవ్ర

Written By Kowsalya
Updated: శనివారం, 26 మే 2018 (13:51 IST)
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని బ్రహ్మ స్థానం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో బరువైన యంత్ర సామాగ్రి గాని లేదా బరువైన వస్తువులను కాని ఉంచకూడదు. ఒకవేళ గనుక ఉంటే వాటిని తీసివేయడం మంచిది. అవి ఆ స్థానంలోనే ఉంటే, అవి వ్యాపార లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
 
మన ఇంట్లో మంచం లేదా పరుపు ఎక్కడ ఉండాలి అనే విషయం దగ్గర నుండి, గోడపై బొమ్మలను ఎక్కడ ఎలా వేలాడ దీయాలి అనే విషయాలు వరకు, మన యొక్క జీవితంలో మన యొక్క అదృష్టంపై ఇవన్నీ ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తుల అదృష్టాన్ని ఇవి నిర్ణయిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ అతిచిన్న విషయాలన్నీ మన జీవితాల్లో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మన అదృష్ట తలుపులు తెరుచుకోవడానికి పాటించవలసిన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
డబ్బుల డబ్బా లేదా బీరువాని దక్షిణ దిశలో పెట్టాలి. దాని యొక్క తలుపులు ఉత్తరం దిశకు తెరుచుకునేలా ఉండాలి. ఉత్తర దిశని కుబేర స్థానం అంటారు. కుబేరుడు ధనానికి అధిపతి. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం అనేది ఒక శక్తివంతమైనది. మన యొక్క శక్తి సామర్ధ్యాలను రెట్టింపు చేసేందుకు అద్దం చాలా ఉపయోగపడుతుంది. మీరు గనుక పర్సులో అద్దాన్ని ఉంచుకున్నట్లైతే మీ ఆర్ధికస్థితిగతులు అతి త్వరలోనే మెరుగుపడతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది.
 
ఇంట్లోని ఈశాన్య మూలాన చెత్త డబ్బాని లేదా చెత్త వస్తువులను గాని ఉంచకూడదు. ఆ వైపున ఎత్తైన భవనం గాని ఉంటే, అటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో తులసి మొక్కని ఉంచుకోవాలి. తులసి మొక్క ఆర్ధికస్థితిగతులపై వ్యతిరేక ప్రభావం చూపించే శక్తులన్నింటిని ఆపివేస్తుంది.
 
ఈశాన్య మూల ఒక దేవతా సంబంధితమైన దిశ. ఈ దిశలో ఎటువంటి వ్యతిరేక శక్తులు రాకూడదు. ఈశాన్యం మూల చిన్న అక్వేరియమ్ ఉంచితే మంచిది. ఆలా ఉంచడం ద్వారా నీటి యొక్క ప్రవాహం అనేది ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతాయి. డబ్బు అధికంగా రావడం మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ఈ వాస్తు చిట్కాలను పాటించిస్తే మంచిది.
 
ఇంటి మూలలు చాలా ముఖ్యమైనవి. నైరుతిమూల అనేది భార్యాభర్త లేదా ఆ ఇంటి మనఃశాంతికి సంబంధించినది. నైరుతి భాగంలో ఉండే దక్షిణం వైపు బరువైన బీరువా ఉంటె ఆ ఇంట్లో ధనం ఎక్కువగా నిలుస్తుంది. ఈశాన్యమూల అనేది సాక్షాత్తు శివుడు ఉండేది అక్కడ పూజచేసే గదికాని, నీళ్ళుకాని పెట్టవచ్చును. ఈ రెండు లేకపోతే గ్లాసులో నీళ్ళుపెట్టి కలువ పువ్వులు వేసి ఉంచవచ్చును. 
 
ఇంటి వాయువ్యదిశలో మెుక్కలు ఉండవచ్చు లేదా ఇంకేదైనా గాలికి కావాల్సిన వస్తువులు ఉండవచ్చును. ఎందుకంటే అదిగాలి ఎక్కువగా ఉండేచోటు. ఇప్పుడు చెప్పిని మూలలు చాలా ముఖ్యమైనవి. వాస్తును ఎక్కువగా ప్రభావితం చేసేందుకు వీటిని పాటించాలి. ఆగ్నేయదిశలో వంటిల్లు ఉండటమే తగినచోటు.
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments