మీకలా అర్థమైందా? ఆ ఫ్లెక్సీలో ఆ ఫోటో ఎవరదండీ...

బుధవారం, 20 అక్టోబరు 2021 (17:56 IST)
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కారకుడు. ఇది అందరికీ తెలిసిందే. పట్టాభిరాం ఇంటిపై దాడికి ప్రయత్నించారు వైసిపి కార్యకర్తలు. పట్టాభిరాం ఎప్పుడూ టివీల్లో కనిపిస్తూ ఉంటాడు. 

 
అలాంటి వ్యక్తి గురించి ఆందోళన చేయాల్సిన వైసిపి కార్యకర్తలు మరొక పట్టాభి ఫోటోతో ప్రత్యక్షమయ్యారు. ఇదంతా ఎక్కడో కాదు తూర్పు గోదావరిజిల్లా పి.గన్నవరంలో జరిగింది. గన్నవరం తహశీల్ధార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

 
ఆ ఫ్లెక్సీలో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంకు బదులు ఆంధ్రాబ్యాంక్ వ్యవస్ధాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరును పెట్టారు. సిఎంపై దుర్భాషలాడిన కొమ్మారెడ్డి పట్టాభిరాం పేరుకు బదులు వైసిపి నాయకులు వేరే వ్యక్తి ఫోటో పెట్టడం విమర్సలకు తావిస్తోంది. 

 
ఫ్లెక్సీ పట్టుకుని మరీ నేతలు నిరసనకు దిగడం కొసమెరుపు. చాలాసేపటి వరకు ఆ ఫోటో ఎవరిదో గుర్తుపట్టలేకపోయారు. అయితే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు పట్టాభి ఇతను కాదని చెప్పడంతో ఫ్లెక్సీని పక్కకు తీసుకెళ్ళి పడేశారు.

అన్నీ చూడండి

గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ యువ శక్తి ట్రస్ట్

మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?

ఆన్‌లైన్ ప్రియురాలి కోసం సరిహద్దు దాటిన పీవోకే యువకుడు

తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న

అన్నీ చూడండి

టీలో కల్తీని ఎలా గుర్తించాలి?

కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తర్వాతి కథనం
Show comments