Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత దేహాలకు కూడా కరోనా వైరస్ టెస్ట్ చేయాల్సిందే

Updated: గురువారం, 14 మే 2020 (17:33 IST)
కొద్ది వారాల క్రితం మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. చనిపోయిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
చనిపోయిన వారికి పరీక్షలు చేయకపోతే 3వ స్టేజీకి వెళ్లే ప్రమాదం ఉందని పిటీషనర్ వాదన. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్ట్ మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో నివేదించాలని కోర్టు ఆదేశించింది. 
 
ఈ నెల 26వ తేదీ వరకు స్పష్టమైన నివేదికను సమర్పించాలని ఆజ్ఞాపించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుండగా, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అన్నీ చూడండి

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

తర్వాతి కథనం
Show comments