సంబంధిత వార్తలు
- లాక్డౌన్ రూల్స్ బ్రేక్ : బీజేపీ అధ్యక్షుడిపై తెలంగాణ పోలీసుల కేసు
- దేశంలో 70 వేలు దాటిన కరోనా కేసులు.. తెలంగాణలో మళ్లీ వేగం
- వందే భారత్ మిషన్ : కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన తెలుగు పౌరులు
- ఈ లాక్ డౌన్ ఇప్పట్లో పోయేలా లేదు, మనకిక పెళ్లి కాదని సూసైడ్ చేసుకున్న ప్రేమజంట
- లాక్డౌన్పై వెనుకంజ లేదు.. గ్రీన్ జిల్లాలుగా ప్రకటించండి : తెలంగాణ సర్కారు
కరోనా హైరానా : మరో 3 వేల కేసులు - తెలంగాణాలో మళ్లీ వేగం
దేశంలో కరోనా వైరస్ హైరానా ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా మరో 3 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,415కి చేరింది.
ఇక గత 24 గంటల్లో దేశంలో 3,525 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 74,281కి చేరింది. అలాగే, కరోనా నుంచి 24,386 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 47,480 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విశ్వరూపాన్ని చూపుతున్నాయి. మంగళవారం కూడా కొత్తగా 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 31 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఇపుడు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ 31 మందిలో 14 మంది వలస కూలీలు ఉన్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో 1326 కరోనా కేసులు నమోదైవుండగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 32 మంది చనిపోయారు.
