గచ్చిబౌలిలో నకిలీ బాబా గుట్టు రట్టు: ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని..?

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:33 IST)
గచ్చిబౌలిలో నకిలీ బాబా గుట్టు రట్టు అయ్యింది. గచ్చిబౌలిలో పూజలు చేసి ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని నకలీ బాబా యువతిని మోసం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వజిత్ జా అనే బాబా కాలభైరవ పూజతో ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని యువతిని నమ్మబలికాడు. 
 
ఫేస్ బుక్ ద్వారా యువతితో విశ్వజిత్ బాబా పరిచయం పెంచుకున్నాడు. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎక్సమినేషన్ పాస్ చేయిస్తానని చెప్పడంతో యువతి బాబాను నమ్మింది.
 
కాల భైరవ పూజ చేసి తన శక్తుల ద్వారా ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని చెప్పడంతో యువతి బాబాను పూర్తిగా నమ్మింది. అనంతరం విడతలవారీగా 80 వేల నగదును దొంగ బాబా తన అకౌంట్లో జమ చేయించుకున్నాడు. 
 
అనంతరం బాబాను సంప్రదించేందుకు అనేక మార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దాంతో మోసమోయనని తెలుసుకుని యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

అన్నీ చూడండి

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

తర్వాతి కథనం
Show comments