Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టు బెయిల్

Written By వరుణ్
Updated: బుధవారం, 9 నవంబరు 2022 (17:29 IST)
హైదరాబాద్ నగరంలోని గోషామహాల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బీజేపీకి చెందిన రాజాసింగ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల రాజాసింగ్‌ను పీడీయాక్ట్ కింద అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం కింది కోర్టులను ఆశ్రయించగా, నిరాశ ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఆయన అనుకూలంగా తీర్పు వచ్చింది షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని రాజాసింగ్‌కు కోర్టు సూచించింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేయొద్దని, మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని ఇలా పలు షరతులు విధించింది. అంతేకాకుండా, తక్షణమే రాజాసింగ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. 
 
పీడీయాక్ట్ కింద రాజా సింగ్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేయగా, ఆయన గత 40 రోజులుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. చివరకు పలు మార్లు న్యాయపోరాటం తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. 

అన్నీ చూడండి

Srinivasa Mangapuramm Review: ఆకట్టుకోని జై కృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం రివ్యూ

Ramayan trialer: తమ్ముడూ యశ్ నువ్వు అదరగొట్టావు అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్

కాంతార రిషబ్ శెట్టికి అరుదైన అవార్డు.. ఆస్ట్రేలియాలో లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు

Vijay Deverakonda :తరుణ్ భాస్కర్ పై విజయ్ దేవరకొండ విమర్శ, ప్రశసలతో స్వీట్ పోస్ట్

కోయంబత్తూరులో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments