Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య విద్యార్థిని ప్రీతి బ్రెయిన్ డెడ్ - ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత!?

Written By వరుణ్
Updated: ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (18:52 IST)
వరంగల్‌ కాకతీయ వైద్య కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆదివారం వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 
 
అంతకుముందు ప్రీతిని చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమేనని తెలిపారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ విషమంగానే ప్రకటించారు కూడా. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఆమె మృతి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 
 
కాగా, తన సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. సైఫ్‌తో పాటు మరికొందరు సైనియర్ విద్యార్థులు చేసిన ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె గత ఐదు రోజులుగా నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాగా, ఆమె ఆదివారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. 

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments