రాయలసీమ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం : తెలంగాణాలో వర్షాలు

ఆదివారం, 22 మే 2022 (09:41 IST)
రాయలసీమ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడివుంది. దీంతో తెలంగాణా రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
రాయలసీమ ప్రాంతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని, దీనికితోడు బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మెల్లగా ముందుకు కదలుతున్నాయని వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 11.2 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది. అలాగే, బంట్వారంలో 11, దుద్యాలలో 10.2, ధవలాపూర్‌లో 9.5 సెంమీ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శనివారం కుమరంభీం జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments