అమ్మవారి దర్శనం కోసం వెళ్లి వస్తూ అనంతలోకాలకు .. ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన కారు

సోమవారం, 13 డిశెంబరు 2021 (13:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో ఓ కారు, ఆటోలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన శశి భరత్ అనే వ్యక్తి కారును అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో కొమురవెల్లి దేవాలయం దర్శనం పూర్తిచేసుకుని గజ్వేల్ వైపు ఓ ఆటో వెళుతుంది. 
 
దీన్ని వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం సరిగ్గా జిల్లాలోని కొండపాక మండలంలోని కొడకండ్ల గ్రామ శివారులో ఉన్న ఒక వంతెన వద్ద జరిగింది. 
 
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగమణి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments