విజ్ఞాన గనులు పుస్తకాలు : డిఐజి రంగనాధ్

శనివారం, 25 సెప్టెంబరు 2021 (21:50 IST)
పుస్తకాలు విజ్ఞాన గనులని ప్రతి పుస్తకం మనిషి జీవితంలో ఎక్కడో ఒక చోట ప్రభావితం చేస్తుందని నల్లగొండ డిఐజి ఏ.వి..రంగనాధ్ అన్నారు.
 
శనివారం క్యాంపు కార్యాలయంలో జనరల్ స్టడీస్ - 1 పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో నియామక పరీక్షలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

ఎన్నో రకాల పుస్తకాలను ముద్రించి నిరుద్యోగులకు ఉద్యోగ సాధనలో అనేక విజయాలు అందించిన తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఈ పుస్తకం ముద్రించడం సంతోషంగా ఉన్నదని, అదే సమయంలో జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదే సత్యనారాయణ భాగస్వామ్యం వహించడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ సందర్బంగా సత్యనారాయణను ఆయన శాలువాలతో సత్కరించారు.
 
పుస్తక రచనలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆదె సత్యనారాయణ పాలు పంచుకోవడం విశేషం. ఈయన ప్రస్తుతం అనుముల మండలం మర్లగడ్డ గూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
 
కార్యక్రమంలో రాష్ట్రోపాద్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి గణపురం భీమయ్య, కందిమల్ల నరేందర్ రెడ్డి, పుస్తక రచయిత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అన్నీ చూడండి

జీవితంలో హోమియోపతి కీలక పాత్ర : కోహ్లీ సతీమణి అనుష్క

జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు

'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్‌బ్లోయింగ్‌, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

తర్వాతి కథనం
Show comments