సింగరేణిలో ప్రమాదం : డంపర్ ఆపరేటర్ కన్నుమూత

గురువారం, 23 డిశెంబరు 2021 (11:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గుగనుల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో పలువురు కార్మికులు మృత్యువాతపడుతున్నారు. ఇది కార్మికులతో పాటు వారి కుటుంబాల్లో ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీకొట్టింది. దీంతో ఒక డంపర్ ఆపరేటర్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే సింగరేణి అధికారులు హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకుని, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆపరేటర్ శ్రీనివాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరణ వార్త తెలియగానే మృతుని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments