Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణిలో ప్రమాదం : డంపర్ ఆపరేటర్ కన్నుమూత

Written By ఠాగూర్
Updated: గురువారం, 23 డిశెంబరు 2021 (11:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గుగనుల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో పలువురు కార్మికులు మృత్యువాతపడుతున్నారు. ఇది కార్మికులతో పాటు వారి కుటుంబాల్లో ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీకొట్టింది. దీంతో ఒక డంపర్ ఆపరేటర్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే సింగరేణి అధికారులు హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకుని, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆపరేటర్ శ్రీనివాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరణ వార్త తెలియగానే మృతుని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments