తేనేటి టవర్స్‌లో వ్యభిచారం.. ఆరుగురు అరెస్ట్

శనివారం, 26 మార్చి 2022 (10:46 IST)
అమీర్ పేట, ఓయో హోటల్‌ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బల్కంపేట ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్‌లో ఉన్న ఓయో రూమ్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. 
 
ఈ సమయంలో హోటల్‌ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్‌ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు.
 
రమేష్‌ను విచారించగా తాను జనార్దన్‌ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్‌లోని విద్యుత్‌ టవర్స్‌లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్‌ను అరెస్టు చేశారు. 
 
జనార్దన్‌ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్‌ మీరా, కో ఆర్టినేజర్‌ తిరుమల్‌రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. 

అన్నీ చూడండి

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments