టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు : 13 మంది శాశ్వతంగా డీబార్

గురువారం, 1 జూన్ 2023 (09:32 IST)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఈ ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్న 13 మందిని శాశ్వతంగా డీబార్ చేశారు. భవిష్యత్‌లో వీరు ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా ఉండేందుకు, ఉద్యోగాలు పొందకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు శాశ్వతంగా డీబార్ చేసిన వారి పేర్లతో కూడిన జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి విడుదల చేశారు. ఈ 13 మందితో కలిసి ఇప్పటివరకు డీబార్ అయిన వారి సంఖ్య 50కి చేరింది. 
 
భవిష్యత్‌తో టీఎస్ పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలకు వీరు హాజరుకాకుండా, ఉద్యోగాలు పొందకుండా చర్యలు తీసుకుంది. ఈ జాబితాను టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ విడుదల చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్న 37 మందిని మంగళవారం శాశ్వతంగా డీబార్ చేయగా, తాజాగా మరో 13 మందిని డీబార్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

అన్నీ చూడండి

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప

Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్

తర్వాతి కథనం
Show comments