Webdunia - Bharat's app for daily news and videos

Install App

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 27 అక్టోబరు 2024 (10:41 IST)
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన తెలుగు చిత్ర నృత్యదర్శకుడు జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ వీడియోతో పాటు తన మనసులోని మాట ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. "గత 37 రోజుల్లో తాను ఎంతో కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థనల వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్నానని పేర్కొన్నారు. నిజం అనేది ఏదో ఒక రోజు బయటపడుతుందన్నారు. తన ఫ్యామిలీ పడిన కష్టం తనను ఎప్పటికీ వేదనకు గురి చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. తాను జైలులో ఉన్న సమయంలో తమ కుటుంబం నరకం అనుభవించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తూ వచ్చిన శృష్టివర్మ పెట్టిన లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపి అరెస్టు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ 37 రోజుల పాటు జైల్లోనే గడిపారు. 

అన్నీ చూడండి

ఇది iPhone కోసం ఆత్మహత్య కాదు, వెనుక ఏదో వుంది...

ఆమె వల్ల పరువు పోతోంది.. చంపెయ్... : కుమార్తెను ప్రియుడితో హత్య చేయించిన తండ్రి

ఆంధ్రప్రదేశ్‌లో వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లు, హోం హెల్త్ కేర్ సేవలను బలోపేతం చేసిన స్టార్ హెల్త్

కోట్లకు పడగలెత్తుతున్న యాచకులు, వీడియో చూడండి

మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి చేశాడు : కాకినాడ ఎస్పీ బిందు మాధవ్

అన్నీ చూడండి

విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్‌ రోగికి మళ్లీ నడక

న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?

నిమ్మకాయ టీ తాగుతున్నారా?

చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

తర్వాతి కథనం