దేవిశ్రీప్రసాద్‌‌కి అప్పుడు నేనో ప్రోగ్రామర్... సామజవరగమనాతో అదరగొడుతున్న తమన్ ఇంకేమన్నాడంటే?

Updated: శుక్రవారం, 27 డిశెంబరు 2019 (19:38 IST)
టాలీవుడ్‌లో సంగీతానికి సంబంధించి ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు దేవిశ్రీప్రసాద్, తమన్‌లు మాత్రమే. అగ్రహీరోల సినిమా అంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు సంగీతం అందించాల్సిందే అనేంతగా ట్రెండ్ సెట్ అయింది అంటే అతిశయోక్తి కాదు.

కాగా... దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి బాణీలు అందిస్తూండగా, అల్లు అర్జున్ నటిస్తున్న అల.. వైకుంఠపురములో చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు. దీనికి సంబంధించి తమన్, ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
 
దేవిశ్రీ సంగీతంలో సరిలేరు నీకెవ్వరు, మీరు సంగీతం అందించిన అల వైకుంఠపురములో సినిమాలు ఒకేసారి వస్తున్నాయి కదా, మీపై ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా, పోటీ ఉన్నప్పుడే మన స్టామినా ఏంటో తెలుస్తుందని జవాబిచ్చారు తమన్.

అయితే, తనకు దేవిశ్రీప్రసాద్‌తో సత్సంబంధాలు ఉన్నాయనీ, ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో సంభాషణలు కూడా జరుగుతూ ఉంటాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా, తాను గతంలో దేవిశ్రీప్రసాద్ వద్ద తొమ్మిది సినిమాలకు ప్రోగ్రామర్‌గా కూడా వ్యవహరించినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

అన్నీ చూడండి

రిసెప్షన్ కౌంటర్‌కు నిప్పు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతి

ఎల్ నినో ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

గుంతకల్లు- బళ్లారి మధ్య 3వ- 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం.. బాబు, పవన్ థ్యాంక్స్

కాక్రోచ్ చీఫ్‌ అభిజీత్ డిప్కేకు టైఫాయిడ్.. అయినా వెనక్కి తగ్గరట...

NEET అంటే ఏమిటో తెలియదు, మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఆంధ్ర విద్యార్థులు వీడియో

అన్నీ చూడండి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు

మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం

కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం

రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భుజం సర్జరీ

తర్వాతి కథనం
Show comments