ఢిల్లీ-బెంగళూరు, గగనతలంలో విమానం ప్రయాణం... ప్రసవించిన గర్భిణి, తల్లీబిడ్డ క్షేమం

గురువారం, 8 అక్టోబరు 2020 (14:09 IST)
బుధవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం గగనతలంలో ప్రయాణం చేస్తుండగా ఓ గర్భిణికి హఠాత్తుగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీనితో ఆమె విమానంలోనే పండండి బాబుకు జన్మనిచ్చింది.
 
వివరాల్లోకి వెళితే... బుధవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి ఇండిగో విమానం బెంగళూరుకు బయలుదేరింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆ విమానంలో వైద్యురాలు శైలజ వల్లభాని వుండటంతో గర్భిణి సుఖప్రసవం జరిగింది. ఇండిగో క్యాబిన్ క్రూ సాయంతో డాక్టర్ శైలజ పురుడుపోసింది.
విమాన ప్రయాణికులు ఎలాంటి ఆటంకం కలుగలేదనీ, మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని అధికారులు తెలిపారు. కాగా విమానం బుధవారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంది. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. తమ విమానంలో ఓ తల్లి బిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా వుందని కెప్టెన్ ఆనందం వ్యక్తం చేసారు.

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments