తృటిలో పాముకాటు నుంచి తప్పించుకున్న బస్సు డ్రైవర్

సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:56 IST)
Snake
పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయింది. తాజాగా ఓ బస్సు డ్రైవర్ తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా జయపుర గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోజూలానే ఆ డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు. సగం దూరం కూడా వెళ్లింది బస్సు. ఆ తర్వాత ఒక ప్రాంతం దగ్గరలో బ్రేక్ వేద్దామని.. పెడల్‌పై కాలు వేయబోతుండగా.. ఓ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. 
 
దీంతో సదరు డ్రైవర్.. బ్రేక్ వేయకుండా ఇంజిన్ ఆఫ్ చేసి.. చాకచక్యంగా బస్సును స్లో చేశాడు. అనంతరం ప్రయాణీకులందరినీ కిందకు దింపి ఆ పామును ఓ కర్ర సాయంతో బయటికి తీశాడు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments