ఉగ్రవాదులుగా భావించి భద్రతా బలగాల కాల్పులు - 14 మంది పౌరులు మృతి

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:47 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌లో దారుణం జరిగింది. భారత భద్రతా బలగాలు పెద్ద తప్పు చేశారు. సాధారణ పౌరులను ఉగ్రవాదులుగా భావించారు. దీంతో వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా నాగాలాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దారుణం మోన్ జిల్లాలోని తిరు గ్రామంలో జరిగింది. 
 
అంతకుముందు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సాధారణ పౌరులను భద్రతా బలగాలు ఉగ్రవాదులుగా భావించి, ఈ కాల్పులు జరిపారు. మోన్ జిల్లా తిరు గ్రామంలోని ఓటింగ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలువురు జవాన్లు మృతిచెందారు. 
 
దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట చేపట్టింది. ఆ సమయంలో అటుగా వస్తున్న తిరు గ్రామానికి చెందిన కూలీలపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో 14 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం రాత్రి జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హింసకు పాల్పడ్డారు. ఎన్ఎస్సీఎన్ మిలిటెంట్లుగా పొరపాటున అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీస్తుంది. 

అన్నీ చూడండి

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

తర్వాతి కథనం