ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ వ‌ర్షా కాల స‌మావేశాలు....5 రోజులే!

Updated: శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:51 IST)
ఈనెల 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఈ సమావేశాలు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి డిసెంబరులో మరోసారి అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఉండేలా ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తిరిగి డిసెంబరులో మరోసారి సమావేశాలను నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ నెలలోనే ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే. ఈ నెలలో ఐదు రోజులు, డిసెంబర్​లో మరో ఐదు లేదా వారం రోజులు నిర్వహిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.
 
దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్​ల ఎన్నికలు నిర్వహించాలని గతంలో ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, ఇప్పుడు దీనిపై పునరాలోచిస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీల ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని అధికార వైకాపా అంచనా వేస్తోంది. అలా సాధించి సంపూర్ణ మెజారిటీతో శాసన మండలిలో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments