శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (10:29 IST)

పిఠాపురం ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.. క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారుల బృందాలు

pawan kalyan
పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆభివృద్ధి చేసేందుకు నడుంబిగించారు. దీంతో నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించేందుకు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో గల గ్రామ పంచాయతీల్లో, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌కు దిశానిర్దేశం చేశారు. 
 
దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని అన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని అక్కడ పరిస్థితుల తనిఖీ చేస్తూ, సమస్యలను గుర్తిస్తూ నివేదికను సిద్ధం చేసేందుకు పనిచేస్తున్నారు. ఈ నివేదికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు. ఇదే అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ ట్వీట్ చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలోని 52 గ్రామ పంచాయతీలలో పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌ను దిశానిర్దేశం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అన్ని శాఖలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం పాల్గొని తనిఖీలు చేపట్టాలని, సమస్యలను గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 
 
దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని అన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని అక్కడ పరిస్థితుల తనిఖీ చేస్తూ, సమస్యలను గుర్తిస్తూ నివేదికను సిద్ధం చేసేందుకు పనిచేస్తున్నారు. ఈ నివేదికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు అని పేర్కొన్నారు.