ఓబీసీ కుల గణనకు కేంద్రం నో... ఎంపీ సాయి రెడ్డికి జవాబు

బుధవారం, 15 డిశెంబరు 2021 (16:46 IST)
దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్‌) సరైన సాధనం కాదని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని తెలిపారు.
 
 
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన మీదట జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం షెడ్యూలును రూపొందిస్తుందని మంత్రి తెలిపారు. బీసీ జనాభా లెక్క తేల్చేందుకు వీలుగా సెన్సెస్‌లో కులగణన జరిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయం హోం మంత్రిత్వ శాఖకు తెలుసునని చెప్పారు. దేశంలో జనాభా సంఖ్యను లేదా ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన జనాభాను లెక్కించడం నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) ఉద్దేశం కాదని మంత్రి అన్నారు. వర్గీకరణ అవసరాల కోసమే ఎన్‌ఎస్‌ఎస్‌ ఇంటింటి సర్వే చేపడుతుందని వెల్లడించారు.

అన్నీ చూడండి

Allu Arjun: కేర‌ళ‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. హ్యాపీ రీ రిలీజ్‌

Sukku: సుకుమార్, బన్నీ వాస్ నిర్మాతలుగా ప్రియదర్శి కథానాయకుడిగా మూవీ

T. Gopichand : టి. గోపీచంద్ కొత్త చిత్రం సింగ టైటిల్ ప్రోమో రిలీజ్

సుత్తి వీరభద్రం, బ్రహ్మి హాస్యభరితమైన బీచ్ ప్రోమోతో అనిల్ రావిపూడి ప్రయోగం

Kiran Abbavaram: దర్శకుడిగా తొలి చిత్రం రియాలిటీ ని ప్రారంభించిన కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments